ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 8 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ కార్డు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి, తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15 నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నె్న్స్(WhatsApp Governance) ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందుతోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా ఇప్పటికే కార్డు ఉన్నవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా పెళ్లైన జంటలు, లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లిన వారు, తమ కార్డులను విభజించుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇలాంటి సేవ పొందడం కోసం గతంలో వివాహ ధ్రువీకరణ పత్రం(Marriage certificate అడిగేవారు. అయితే ఇప్పుడు మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. అలాగే స్వచ్ఛందంగా రేషన్ కార్డు వదులుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.మరోవైపు వివాహం కాకుండా 50ఏళ్లు దాటి ఒంటరిగా జీవిస్తున్న వారికి కూడా ఈసారి రేషన్ కార్డులు అందివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం
అలాగే ఆశ్రమాల్లో ఉంటున్నవారికి కూడా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు సైతం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు(New ration card)లు మంజూరు చేయనుంది. వీటితోపాటుగా రాష్ట్రంలోని ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు, అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారికి అంత్యోదయ అన్నయోజన కార్డు(Antyodaya Anna Yojana Card)లు అందించనున్నారు. ఈ కార్డు కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం అందిస్తారు. ఏలూరు, అల్లూరి జిల్లాల్లోని కొండప్రాంతాల్లో ఉండే 12 కులాల గిరిజనులు, చెంచులకు కూడా అంత్యోదయ అన్నయోజన కార్డులు అందించనుంది ఏపీ ప్రభుత్వం. రేషన్ కార్డులు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తోంది.
Read Also : Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం