हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Sandhya Theater Incident: ఆసుప్రతి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్?

Anusha
Sandhya Theater Incident: ఆసుప్రతి నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్?

పుష్ప – 2 సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డులను సైతం తిరగరాసింది. కానీ ఓ కుటుంబానికి మాత్రం తీరని విషాదాన్ని మిగుల్చింది. ‘పుష్ప 2’ ప్రీమియర్స్ తరుణంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ మీద అభిమానంతో సినిమా చూడడానికి వచ్చిన ఓ కుటుంబానికి అనుకోని చేదు ఘటన జీవితాంతం మర్చిపోలేని విషాదాన్ని మిగుల్చింది. ఆ ఘటన కారణంగానే అల్లు అర్జున్ సైతం జైలుకు వెళ్లారు.అల్లు అర్జున్ మీద అభిమానంతో రేవతి అనే మహిళ, ఆమె భర్త, కుమారుడు శ్రీ తేజ్ తో కలిసి ‘పుష్ప 2’ ప్రీమియర్స్ చూడడానికి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అయితే అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే రేవతి మరణించగా, శ్రీతేజ్‌కు ఊపిరి ఆడకపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. వెంటనే బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

బ్రెయిన్ డ్యామేజ్

గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఈ దుర్ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి శ్రీతేజ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు సైతం శ్రీ తేజ్ ను చూడడానికి హాస్పిటల్ కు వెళ్లడం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే అప్పటి నుంచి కోమా లోనే ఉన్న శ్రీ తేజ్‌ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది.ఇప్పటికీ చికిత్స కొనసాగుతుండగా రోజురోజుకీ శ్రీ తేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. శ్రీ తేజ్ ప్రస్తుతం కళ్లు తెరిచి చూస్తున్నాడని గత 15 రోజులుగా నోటి ద్వారా లిక్విడ్స్ కూడా అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. మనుషులను గుర్తుపట్టలేకపోయినా ప్రస్తుతం తన ఆరోగ్యం మాత్రం స్టేబుల్‌గానే ఉందని అంటున్నారు.

ప్రీమియర్స్

దీంతోనే డాక్టర్లతో పాటు శ్రీతేజ్ కుటుంబ సభ్యులు నిర్ణయం మేరకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప్రతి నుంచి బాలుడిని డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించినట్టు సమాచారం. ఫిజియోథెరపీ చేస్తే మరికాస్త త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయనే రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించామని కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు. బాలుడు త్వరగా కొలుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.మరి ఇప్పటికైనా ప్రజలు వారి కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగకుండా ప్రీమియర్స్, సినిమా రిలీజ్ ల సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని సినిమా ఈరోజు కాకపోతే రేపు అయినా చూడొచ్చు అని ఈ తరహా విషాదం జరిగితే సినిమా హీరోలు ఎవరు కనీసం పట్టించుకోరని అంటున్నారు.

Read Also : Wall Collapse: సింహాచలం దుర్ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతి విద్యార్థినిపై దాడి: హోంమంత్రి కఠిన స్పందన

తిరుపతి విద్యార్థినిపై దాడి: హోంమంత్రి కఠిన స్పందన

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

మంచు గడ్డపై ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు..ఆపై ఏమైంది?

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

గోవాకు వెళ్లే జంటలకు జాగ్రత్త..

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

📢 For Advertisement Booking: 98481 12870