టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
వివాహం
వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి. సమంతది తప్పంటే. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు.నాగ చైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈక్రమంలోనే శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు.అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు.కానీ, ప్రేమించుకున్న సమయంలో వీరి చేసిన తప్పు ఇప్పటికీ వారిని వెంటాడుతోంది. సమంత , నాగ చైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన టాటూలు వేయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

టాటూ
వీరి పెళ్లికి ముందే ఈ టాటూలు వైరల్ కావడంతో సమంత , నాగ చైతన్య ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టునే వీరి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాలకే వీరు విడిపోయారు. అయితే వీరి చేతిపై వేయించుకున్న టాటూలు మాత్రం అలానే ఉన్నాయి. విడిపోతామని తెలియక వీరు ఇలా చేతిపై టాటూలు వేయించుకున్నారు. విడిపోతామని తెలిస్తే ఎవరూ కూడా ఇలాంటి పని చేయరు. టాటూలపై సమంత రియాక్ట్ అయ్యారు.నేను చెప్పేది ఒక్కటే ఎప్పుడూ టాటూ వేయించుకోవద్దు. అస్సలు టాటూ వేయించుకోవద్దు. అంటూ మళ్లీ మళ్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ కామెంట్లు నెట్టింట వైరల్గా మారాయి.
Read Also: Pahalgam Terror Attack: పాక్లోనూ అబీర్ గులాల్ మూవీ పై నిషేధం ఎందుకో తెలుసా?