ఉగ్రవాదుల్లో పాక్ సైనికుడు హషిమ్ మూసా గుర్తింపు
పహల్గామ్ దాడిలో పాకిస్థాన్ పాత్ర ఉందనేందుకు మరొక ఆధారం లభించిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి దర్యాఫ్తులో భాగంగా అధికారులు కశ్మీర్ లో వందలాదిమందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడైన హషిమ్ మూసాకు పాక్ సైన్యంతో సంబంధం ఉందని తేలింది. హషిమ్ మూసా పాక్ పారా కమాండో అని, లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. తమ అదుపులో ఉన్న 15 మంది ఉగ్రవాద ఓవర్ గ్రౌండ్ వర్కర్లు మూసాకు ఉన్న సైనిక నేపథ్యాన్ని ధ్రువీకరించారని అధికారులు వెల్లడించారు. మూసాతో పాటు ఈ దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్లో శిక్షణ పొందినట్లు గుర్తించామన్నారు.

కోవర్ట్ ఆపరేషన్లకు ప్రత్యేక శిక్షణ
హషిమ్ మూసా, పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరే తోయిబాలోకి సహాయకుడిగా చేరినట్టు సమాచారం. అత్యాధునిక ఆయుధాల వినియోగం, దాడుల ప్రణాళికల్లో నిపుణత కలిగిన శిక్షణ పొందినట్లు నిర్ధారణ.
మిగతా ఉగ్రవాదులపై వివరాలు
దాడిలో పాల్గొన్న జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్లో శిక్షణ పొందినవారని గుర్తింపు.
ఈ ముగ్గురిలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సైనిక వర్గాల సమాచారం.
ఉగ్రవాదం – పాకిస్థాన్ సైన్యం లింక్కు మునుపెన్నడూ లేనింత నిదర్శనం.
అంతర్జాతీయ మద్దతు కోరే దిశగా భారత్
ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్ను “ఉగ్రవాద సహాయక దేశంగా” గుర్తించాలన్న భారత్ యత్నాలకు ఊతమిచ్చే అవకాశముంది. ఐరాస భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల ముందు భారత దౌత్యవాదం మరింత తీవ్రతరం కానుంది.
Read Also: Spain France Portugal: యూరప్లో కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ..స్తంభించిన జనజీవనం