हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

YS Sharmila : ఉగ్రవాదుల దాడి.. తెలుగువారి మృతి బాధాకరం : వైఎస్ షర్మిల

sumalatha chinthakayala
YS Sharmila : ఉగ్రవాదుల దాడి.. తెలుగువారి మృతి బాధాకరం : వైఎస్ షర్మిల

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. టెర్రరిస్టుల దాడిలో 30 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తీవ్రంగా కలిచి వేసిందని ఆమె పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్ షర్మిల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఉగ్రవాదుల దాడి తెలుగువారి మృతి

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు

గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడాలని కోరారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు పోకుండా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

కాగా, ఈ ఘటనలో మరణించిన వారిని స్మరించేందుకు స్థానికులు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.​ ఈ దాడి ఉగ్రవాదుల నిర్దయితనను, అమాయకులపై దాడుల తీవ్రతను మరోసారి ప్రదర్శించింది. భద్రతా దళాలు, ప్రభుత్వాలు ఈ తరహా దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870