AP 10th class results released

10th Class Results : ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల..

10th Class Results : ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు.

Advertisements
ఏపీ పదో తరగతి ఫలితాలు

రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు

బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ ఉత్తీర్ణత కాలేదు. జిల్లాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే.. ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 93.90శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

వాట్సాప్ లో ఫలితాలు ఇలా..

. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.
. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.
. అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి.
. అక్కడ రోల్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
. ఈ రిజల్ట్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ

కాగా, ఏపీలో మే నెలలో టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి మే 19వ తేదీ నుంచి మే 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. టెన్త్ క్లాస్ పరీక్షలలో ఫెయిలయిన విద్యార్థులు బాధ పడొద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ నాలుగు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలని వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Read Also: దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

Related Posts
SSC Public Exams 2025: పదో తరగతి పరీక్షలకు కీలక సూచనలు
పదో తరగతి విద్యార్థులకు ముఖ్య సూచనలు

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు Read more

KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే ప్రవీణ్ చనిపోయారంటూ సీసీ కెమెరాల ఫుటేజీతో సహా పోలీసులు చెబుతున్నా… క్రైస్తవ సంఘాలు ఈ Read more

పోలీసుల కస్టడీకి తులసిబాబు
Kamepalli Tulasi Babu

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు లో నిందితుడు కామేపల్లి తులసి బాబు ను గుంటూరు కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి Read more

Nara Lokesh: పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి బోర్డు పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×