భారత రవాణా రంగంలో మరో ముఖ్యమైన మార్పు రాబోతున్నది. భారత్ లో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా, వాహనం కదులుతున్నప్పుడే టోల్ రుసుమును వసూలు చేసేందుకు ఉపయోగపడుతుంది.వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్) వంటి ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దీనితో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉపయోగించవచ్చు.వాహనం యొక్క కదలికలను ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి, ఆ సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్కు పంపుతారు. ప్రయాణించిన దూరం మరియు రహదారి రకం ఆధారంగా టోల్ రుసుమును లెక్కిస్తారు.టోల్ రుసుము వాహన యజమాని యొక్క అనుసంధానించబడిన ఖాతా (బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్) నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది.
ఆధారిత సాంకేతికత
చెల్లింపు చేయడంలో విఫలమైతే ఫాస్ట్ట్యాగ్ సస్పెండ్ చేయబడవచ్చు ఇతర వాహన సంబంధిత జరిమానాలు విధించబడవచ్చు. ఎంపిక చేసిన టోల్ ప్లాజాలలో ఈ వ్యవస్థ పనితీరు, సామర్థ్యం వినియోగదారుల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటారు. మే 1 నుండి కొత్త సాంకేతికతను కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా టోల్ వసూలు విధానంలో మార్పులు ఉండవచ్చు.ఈ విధానంలో వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జి పిఎస్) లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జిఎన్ఎస్ఎస్) వంటి ఉపగ్రహ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు దీనితో పాటు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉపయోగించవచ్చు.వాహనం యొక్క కదలికలను మరియు ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించి, ఆ సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్కు పంపుతారు. ప్రయాణించిన దూరం రహదారి ఆధారంగా టోల్ రుసుమును లెక్కిస్తారు.టోల్ రుసుము వాహన యజమాని యొక్క అనుసంధానించబడిన ఖాతా (బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్) నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది.

నితిన్ గడ్కరీ స్పందన
టోల్ ప్లాజాలు ఉండవు కాబట్టి ట్రాఫిక్ జామ్లు గణనీయంగా తగ్గుతాయి.వాహనదారులు ఆగకుండా ప్రయాణించవచ్చు కాబట్టి సమయం ఇంధనం ఆదా అవుతుంది. టోల్ ప్లాజాల నిర్వహణ సిబ్బంది ఖర్చులు తగ్గుతాయి. టోల్ వసూలు మరింత సమర్థవంతంగా జరుగుతుంది.ప్రయాణించిన దూరం మేరకు మాత్రమే రుసుము చెల్లించే అవకాశం ఉంటుంది. శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్పై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడం,టోల్ వసూలును మరింత సమర్థవంతంగా చేయడమే అని ఆయన తెలిపారు. మరో 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్ కార్యచరణను మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.