हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Maoist : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి

sumalatha chinthakayala
Maoist : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి

Maoist : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరి తలలపై రూ.13లక్షల రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు  ఇద్దరు

ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మావోయిస్టు అగ్ర నేత, కమాండర్‌ హల్దార్‌, ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు. హల్దార్‌పై రూ.8లక్షలు, రామిపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ వెల్లడించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. వీరిలో ఒక్క బస్తర్‌ డివిజన్‌లోనే 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870