हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Murder: భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

Vanipushpa
Murder: భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

భర్త దాడి చేశాడు.. భార్య తల పోల్‌కు తగిలి గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే.. ఎక్కడైనా భర్త దాడిలో భార్య ప్రాణాలు కోల్పోతే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు.. కానీ ఇక్కడ మాత్రం స్టోరీ డిఫరెంట్. భర్తకు పడే శిక్ష తగ్గించి న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు, సహచరులు.. విశాఖలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆలోచింపజేస్తోంది. విశాఖలో ఇద్దరు డాన్సర్లు.. బంగారు రాజు, రమాదేవి..! ఇద్దరూ స్టేజ్ షోలు చేస్తుంటారు.. ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు.. అన్యోన్య దాంపత్యం వారిది. వాళ్లకు ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. కానీ మనస్పర్ధలతో క్షణికావేశం ఆ దాంపత్య జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేషంలో భర్త దాడి చేయడంతో.. తల పక్కనే ఉన్న పోల్కు తగిలి భార్య ఆసుపత్రిపాలైంది. చివరకు ప్రాణాలు కోల్పోయింది.

భర్త దాడిలో భార్య డ్యాన్సర్ మృతి..కారణాలు ఏంటి?

కాస్త మనస్పర్ధలు వచ్చాయి
మాధవదారకు చెందిన అలమండ బంగార్రాజు, అల్లిపురానికి చెందిన రమాదేవి డాన్సర్లు. గత ఏడేళ్లుగా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. డ్యాన్సర్ వృత్తి వారి జీవనాధారం. ఇద్దరూ ప్రేమించుకొని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మాధవధారలో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు. అన్యోన్యంగా ఉండే జీవితంలో కాస్త మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో రమాదేవి పుట్టింటికి వెళ్ళిపోయింది. మార్చి 30 న బంగారు రాజు అక్కడికి వెళ్లి తనతో పాటు రమ్మన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రమాదేవి బయలుదేరింది. ఆమెను అడ్డగించే క్రమంలో భర్తతో వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో రమాదేవి ముఖంపై కొట్టాడు బంగార్రాజు. కిందపడిన రమాదేవి పక్కనే ఉన్న పోల్‌కు తల తగిలింది. హుటా హుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు.
భర్త బంగారు రాజుకు శిక్ష తగ్గించాలని విజ్ఞప్తి
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురికి తరలించారు. అక్కడికి కుటుంబ సభ్యులు, రమాదేవి సహచరులు, డ్యాన్సర్లు భారీగా చేరుకున్నారు. ఎక్కడైనా భర్త దాడిలో భార్య ప్రాణాలు కోల్పోతే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం.. భర్త బంగారు రాజుకు శిక్ష తగ్గించాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు సహచరులు. ఎందుకంటే ఇద్దరూ అన్యోన్య దాంపత్యంలో.. క్షణికావేశంలో ఘటన జరిగిందే తప్ప.. కావాలని బంగార్రాజు రమాదేవి ప్రాణాలు తీయలేదని అంటున్నారు. అంతేకాదు.. తల్లి రమాదేవి ప్రాణాలు కోల్పోయింది, ఇప్పుడు భర్త బంగార్రాజుకు శిక్ష పడితే మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ ఆవేదన.
సంశయంలో పడ్డ పోలీసులు
దీంతో ఈ కేసులో ఏం చేయాలో తెలియక పోలీసులు సంశయంలో పడ్డారు. చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు బంధువులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడైన రమాదేవి భర్త బంగార్రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870