हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Andhra Pradesh: తల్లీకూతుళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

Anusha
Andhra Pradesh: తల్లీకూతుళ్లపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్

విశాఖపట్నంలో కొమ్మాది స్వయంకృషినగర్‌ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతి ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి మృతి చెందగా కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి.యువతి తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయింది. ఇక ఆ యువతి కూడా రక్తపు మడుగులోని కొన ఊపిరితో కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు తల్లీ కుమార్తెలపై కత్తితో దాడి చేసిన తర్వాత ఆ ప్రేమోన్మాది అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు రంగంలోకి దిగారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.

హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబత్ర బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

murder 2 21

అరెస్టు

ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుడు నవీన్‌ను శ్రీకాకుళం జిల్లాలోని బుర్జు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో బుధవారం సీపీ మీడియాతో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.దీపిక, నవీన్‌ల మధ్య గత ఆరు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అయితే వారి వివాహానికి ప్రస్తుతం ఆమె ఇంట్లో పెద్దలు నిరాకరించారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే నవీన్ దీపిక, ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి గాయపర్చి పరారయ్యాడన్నారు. ఈ దాడిలో దీపిక తల్లి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు.

ఘటనా స్థలం

నేరానికి ఉపయోగించిన కత్తిని నవీన్ ఘటనా స్థలంలోనే వదిలివేసి పారిపోయాడని తెలిపారు. ఘటన అనంతరం అతను బైక్‌పై శ్రీకాకుళం వెళ్లిపోయాడని, మధ్యలో ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు దుస్తులు, బైక్ మార్చేశాడని సీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

📢 For Advertisement Booking: 98481 12870