हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Chandrababu: తిరుమలలో భక్తుల సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Sharanya
Chandrababu: తిరుమలలో భక్తుల సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలలో పూర్తిస్థాయిలో మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీటీడీపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు, ఆలయ పవిత్రతకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. గత తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతి, ఇతర సేవలపై భక్తుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

తిరుమలలో భక్తుల సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా టీటీడీని తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. తిరుమలలో దశాబ్దాల పాటు నిలిచే విధంగా భక్తుల సౌకర్యాలపై ప్రణాళికలు రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయకూడదని, టీటీడీకి మనం ధర్మకర్తలం మాత్రమేనని చంద్రబాబు అన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు.

భక్తుల సేవల విస్తరణ

టీటీడీలో సమూల ప్రక్షాళన జరగాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అనేక మార్పులు చేశామని సీఎం గుర్తు చేశారు. అయితే, ఇంకా పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదని, అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేని వారిని కొనసాగించవద్దని అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే జేఈవో, సీవీఎస్వో, ఎస్వీబీసీ ఛైర్మన్, బర్డ్ డైరెక్టర్ల నియామకాలు చేపడతామని తెలిపారు. అలిపిరిలో 25 వేల మంది భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని, అక్కడ రోజుకు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం ద్వారా అక్రమాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.

దేవాలయాల అభివృద్ధి

రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో టీటీడీ అందించిన సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ నిర్వహణ, వసతి, లడ్డూ రుచి, అన్నదానం వంటి అంశాలపై సర్వే నిర్వహించగా, ఎక్కువ మంది భక్తులు సేవలు బాగున్నాయని చెప్పినట్లు వెల్లడించారు. భక్తులకున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా విస్తరణ పనులతో సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కోయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను కూడా ఆయన సమీక్షించారు. భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని సౌకర్యాలను అభివృద్ధి చేయాలని టీటీడీకి సీఎం సూచించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870