హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం

HCA Vs SRH:హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం

ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) మధ్య టికెట్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం హెచ్‌సీఏ తమతో అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ, పరిస్థితి మారకపోతే హైదరాబాద్‌ను వదిలి కొత్త వేదిక కోసం వెతుకుతామని హెచ్చరించింది. అయితే, హెచ్‌సీఏ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది.

Advertisements

ఎస్ఆర్ హెచ్

గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, గత రెండేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం, హెచ్‌సీఏకి 3,900 ఉచిత టికెట్లు అందిస్తున్నామని, అందులో 50 టికెట్లు ఎఫ్‌12ఏ కార్పొరేట్ బాక్స్‌కు కేటాయించారని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లకే పరిమితమని, అయినా హెచ్‌సీఏ అదనంగా 20 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది.

ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావుపై, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) చేసిన ఆరోప‌ణ‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. స‌న్‌రైజ‌ర్స్ సంస్థ ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ త‌మ‌పై తీవ్ర ఒత్తిడిని తెచ్చిందని,పాస్‌లు ఇవ్వ‌కపోతే ఆ సంస్థ‌ బ‌య‌ట‌కు వెళ్లిపోతామ‌ని హెచ్చ‌రించింది.

హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం

విచార‌ణ‌

స‌న్‌రైజ‌ర్స్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర‌కు విజిలెన్స్ అధికారులు ఈ వివాదంలో నిజ‌నిజాలు రాబ‌ట్టేందుకు ఈరోజు ఉప్ప‌ల్ స్టేడియానికి వెళ్లారు. విజిలెన్స్ చీఫ్ కొత్త‌కోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచార‌ణ కొన‌సాగుతోంది. 

హెచ్‌సీఏలో అక్ర‌మాలు

హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు, మైదానం సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. టికెట్ల విక్ర‌యం, పాస్‌ల జారీ త‌దిత‌ర విష‌యాల‌ను అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, గ‌తంలోనూ హెచ్‌సీఏలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు ఉప్ప‌ల్ స్టేడియంలో త‌నిఖీలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.ఇప్పటికే స్టేడియం మొత్తం తమ నియంత్రణలోకి వస్తుందని, దీనికి అద్దె కూడా చెల్లిస్తున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. ఎస్ఆర్ హెచ్ ప్రకటన ప్రకారం, ఇది ఒక్క సంఘటన కాదు. గత రెండు సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని ఎస్ఆర్ హెచ్ తెలిపింది.

Related Posts
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
CM Chandrababu's sensationa

తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Read more

సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు
సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు

‘సంక్రాంతి సినిమాలు, టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పుడు ముఖ్యం కాదు’: దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

పార్టీ మార్పు వార్తలపై స్పందించిన శశిథరూర్
Shashi Tharoor reacts to the news of party change

నన్ను విస్మరిస్తే నాకూ ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.. న్యూఢిల్లీ: ప్రధాని మోడీని, కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాస్పదమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. తాను ఇప్పటికీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×