డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

Diego Maradona: డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా చనిపోయిన నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఆయన మృతికి గల కారణం తెలిసింది. మారడోనా వేదనతో మరణించి ఉంటాడని పోస్టుమార్టంలో పాల్గొన్న ఒక నిపుణుడు తెలిపారు. మారడోనా మృతి నేపథ్యంలో ఏడుగురు వైద్య నిపుణులు హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ వైద్యుడు డాక్టర్ మౌరిసియో కాసినెల్లి విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుండె వైఫల్యం, కాలేయ సిరోసిస్ కారణంగా మారడోనా మరణానికి ముందు కనీసం పది రోజులు ఆయన ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోయిందని పేర్కొన్నారు. మారడోనా బాగోగులు చూసుకున్న నర్సులు, వైద్యులు ఈ విషయాన్ని గమనించి ఉండాలని న్యాయమూర్తులకు తెలిపారు.

Advertisements
డీగో మారడోనా మృతికి గల కారణాలు..నాలుగున్నరేళ్ల తర్వాత వెలుగులోకి సత్యం

గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు
మారడోనా గుండె సాధారణం కన్నా రెండింతలు బరువు ఉందని డాక్టర్ మౌరిసియో పేర్కొన్నారు. మరణానికి కనీసం 12 గంటల ముందు ఆయన వేదన అనుభవించి ఉంటాడని వివరించారు. మెదడులో రక్తం గడ్డకట్టుకుపోవడంతో చేసిన ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న మారడోనా నవంబర్ 25, 2020న 60 ఏళ్ల వయసులో బ్యూనస్ ఎయిర్‌లోని అద్దె ఇంట్లో మరణించాడు. మారడోనా కొన్ని దశాబ్దాలపాటు కొకైన్, ఆల్కహాల్‌ వ్యసనంతో బాధపడ్డాడు.
నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు
మారడోనా చివరి రోజుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఏడుగురు వైద్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే వారికి 8 నుంచి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మారడోనా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే పరిస్థితి (పల్మనరీ ఎడెమా) కారణంగా మరణించినట్టు గుర్తించారు.

Related Posts
పాకిస్తాన్‌లో పోలియో వ్యాప్తి: 2024లో 55 కేసులు, సవాలుగా మారిన పరిస్థితి..
pakistan polio cases

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సుల్లో మూడు కొత్త పొలియో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకు పొలియో బాధితుల సంఖ్య Read more

నైజీరియాలో క్రిస్మస్ వేడుకలో విషాదం: 35 పిల్లలు మృతి
nigeria

నైజీరియాలోని ఐబాదాన్ నగరంలో జరిగిన క్రిస్మస్ ఫెయిర్‌లో 35 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర సంఘటన 19 డిసెంబరున జరిగింది. ఎలాంటి అనుకోని పరిస్థితుల్లో, Read more

ప్రధాన నేతలు జీ20 గ్రూప్ ఫోటోకు దూరంగా :బైడెన్, ట్రుడో, మెలోని గురించి చర్చలు
g20 group photo

బ్రెజిల్‌లో జరిగిన జీ20 సదస్సులో, ప్రపంచ నాయకులు ఒక సంప్రదాయ ఫోటో కోసం నిలబడ్డారు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×