Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల GLI, GPF బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి బకాయిల డబ్బులు జమవుతుండగా, మొత్తం రూ. 6,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

379541 good news for telangana govt employees working in ap

ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు కూడా ధృవీకరించారు. తమకు బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు, సీఎస్ విజయానంద్‌కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నిర్ణయం

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యమైన విషయం తెలిసిందే. అనేక ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. అయితే, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గతవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేయగా, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ విడుదలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు స్పందిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జేఏసీ ఛైర్మన్ కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు విసిగిపోయారు. అందుకే ఎన్నికల్లో వారిని సాగనంపారు అని పేర్కొన్నారు. జనవరి 2024లో కూడా ప్రభుత్వం రూ.1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేయడం ద్వారా, ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ డబ్బులు లభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కూడా చర్చించారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎంపీడీవోలను నేరుగా నియమించే విధానాన్ని రద్దు చేసి, పరిపాలన అధికారులకు 50% ఖాళీలు కేటాయించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాలు ముందుగానే జమ చేయడం మరో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉద్యోగుల జీతాల కూడా ముందుగానే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Related Posts
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ktr saval

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హైదరాబాద్‌లోని ఓ న్యూస్ సదరన్ సమ్మిట్‌లో శుక్రవారం మాట్లాడగా, రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ Read more

మహారాష్ట్ర సీఎం గా దేవేంద్ర ఫడణవీస్
Devendra Fadnavis to be swo

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర పఢ్నవీస్ పేరు ఖరారైంది. గత పది రోజులుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ సమయంలో బీజేపీ నాయకులు మరియు శాసనసభ Read more

వెనుకంజ‌లో కాంగ్రెస్‌..లీడింగ్‌లో బీజేపీ అభ్య‌ర్థి..కౌటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ పోగ‌ట్‌
Congress candidate from Julana Vinesh Phogat leaves from a counting center

న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కౌటింగ్ కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.చేదు ఫలితాలు ఎదురవుతోన్నాయి. మొదట్లో సాధించిన Read more

జనసేన ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అనే పేరు
janasena jayakethanam

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *