తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

Mobile Phones: తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) 2024 సెప్టెంబ‌ర్ నివేదిక ప్ర‌కారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగ‌దారుల సంఖ్య 4.19 కోట్లు. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల సంఖ్య 4.4 కోట్లు కాగా, ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల సంఖ్య‌15.25 లక్ష‌లుగా ఉంది.

తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

గ్రామీణ ప్రాంతంలో 41 శాతం
ఇక టెలిఫోన్ వినియోగ‌దారుల్లో 60 శాతానికి పైగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉంటే.. 39 శాతానికి పైగా గ్రామీణంలో ఉన్నారు. కేవ‌లం మొబైల్ ఫోన్ల వినియోగ‌దారుల‌ను చూస్తే ప‌ట్ట‌ణాల్లో 59 శాతం మంది, గ్రామీణ ప్రాంతంలో 41 శాతం మంది ఉన్నారు. అలాగే ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల్లో 96 శాతం ప‌ట్ట‌ణాల్లో ఉంటే.. గ్రామీణంలో కేవ‌లం 4 శాతం మాత్ర‌మే. ట్రాయ్‌ నివేదిక ప్ర‌కారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్‌లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతంగా ఉంది. అంటే రాష్ట్రంలోని స‌గ‌టున ప్ర‌తి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
దేశంలో నాలుగో స్థానంలో
ఈ అంశంలో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. గోవా-152, కేర‌ళ‌-115, హ‌ర్యానా 114 శాతంతో మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణ‌లో ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల సంఖ్య 3.64కోట్లుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు తెలంగాణ ప్రజలు కమ్యూనికేషన్,టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి. సమాచార సేకరణ, డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ విద్య వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్లు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో మొబైల్ కనెక్టివిటీ ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యం.

Related Posts
Telangana: రాష్ట్రంలో రూ.1000 కోట్లు దాటిన ఆస్తిపన్ను వసూళ్లు
Property tax collection in Telangana cross Rs. 1000 crore

Telangana : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే Read more

కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై Read more

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇళ్ల సౌకర్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తును ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం Read more

కేసీ వేణుగోపాల్‌ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Bhatti's key announcement on ration cards

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో భేటీ అయి రాహుల్ గాంధీ కులగణనపై ఇచ్చిన హామీ అమలులో ఉన్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *