క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

Crime News :క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రదీప్‌ గుర్జార్‌ భార్య (22)ను ఎలాగైనా చంపాలని భావించాడు. ఇందుకు టీవీలో క్రైం షోలు చూసి పథకం పన్నాడు. పథకం ప్రకారం తొలుత భార్యను కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కంపూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా స్వల్ప గాయాలైనట్లు సీన్‌ క్రియేట్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు కూడా తొలుత ప్రదీప్‌ చెప్పింది నిజమేనని భావించారు.

క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త


పొంతనలేని మాటలతో పోలీసులకు అనుమానం
అయితే ప్రదీప్‌ వాంగ్మూలంలోని వైరుధ్యాలు, పొంతనలేని మాటలు పోలీసులకు అనుమానం తెప్పించాయి. పైగా ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్ట్‌మార్టం పరీక్షలో తేలింది. దీంతో అనుమానంతో పోలీసులు మృతురాలి భర్త ప్రదీప్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్రైమ్ టీవీ షోలు చూసి తన భార్య హత్యకు ప్లాన్ చేశాడని విచారణలో ప్రదీప్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రదీప్‌ను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అతనితోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం రిపోర్టులో ..
కట్నం కోసం ప్రదీప్‌ తన భార్యను వేధించేవాడంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. అసలు భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో కూడా వెల్లడైంది. పోలీసులు ప్రదీప్‌తోపాటు అతని తండ్రి రాంవీర్ గుర్జార్, అతని బంధువులు బన్వారీ, సోను గుర్జార్‌లపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related Posts
ప్రతీ ఒక్కరూ ముగ్గురు పిల్లలను కనాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్
Everyone should have three children. RSS chief Mohan

న్యూఢిల్లీ: సమాజ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముగ్గురూ పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన Read more

Monkey: ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి..చివరికి ఏమైంది?
Monkey: ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. చివరికి ఏమైందంటే?

పెద్దలు కోతి చేష్టలు అనే మాటను ఊరికే చెప్పలేదు. కోతులు చేసే పని అప్పుడప్పుడూ నవ్వును పుట్టించటమే కాకుండా, కొన్ని సందర్భాల్లో జనాలను కంగారు పెట్టేలా మారుతాయి. Read more

ఒక వ్యక్తి అక్రమ లావాదేవీలతో బ్యాంకులకు నష్టం: పోలీసుల దర్యాప్తు కొనసాగింపు
scam

మణియార్ అనే వ్యక్తి బ్యాంకు లలో 35 అకౌంట్లను తెరిచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.అతను ఈ అకౌంట్లను అనేక అక్రమ వ్యాపారాల కోసం ఉపయోగించాడని పోలీసులు భావిస్తున్నారు. Read more

Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి
Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి

ఉత్తర మెక్సికోలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీంతో అడవి మంటలు చెలరేగాయని, ఆ మంటలు తరువాత అదుపులోకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *