అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. హిందువులు విద్వేషానికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడతారని స్పష్టం చేసింది.

ఖలిస్థానీ గ్రూపుల హస్తం ఉండొచ్చని అనుమానం. లాస్ ఏంజిల్స్లో త్వరలో ఖలిస్థానీ రిఫరెండం జరగనున్న నేపథ్యం హిందూ ఆలయాలపై గతంలో జరిగిన దాడులతో ఈ సంఘటనకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు.
దోషులపై కఠిన చర్యలు
విద్వేషం బలపడటానికి అవకాశం ఇవ్వబోమని చెప్పింది. శాంతి, కారుణ్యాలు పైచేయి సాధించేలా కృషి చేస్తామని తెలిపింది. కొద్ది రోజుల్లో లాస్ ఏంజిల్స్లో ఖలిస్థానీ రిఫరెండం జరగబోతున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. చినో హిల్స్లోని హిందూ దేవాలయంపై దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాధికారులను కోరింది. అమెరికాలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగించే అంశం. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. విద్వేషపూరిత చర్యలను కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం శాంతి, భద్రత కోసం మరింత అప్రమత్తంగా ఉండాలి. విద్వేషపూరిత సంఘటనలను కఠినంగా ఎదుర్కోవాలి. మత పరమైన చిచ్చుపెట్టే చర్యలను నియంత్రించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని భారత్ కోరింది.