हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఏపీ డిజిటల్ అక్షరాస్యత మారాలి :చంద్రబాబు

Sharanya
ఏపీ డిజిటల్ అక్షరాస్యత మారాలి :చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని డిజిటల్‌ అక్షరాస్యుడిగా మార్చాలని సంకల్పించారు. ఈ లక్ష్యంతో రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్‌ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులను కృషి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీపుల్స్‌ పర్సెప్షన్‌, ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

students.jpg

వాట్సాప్‌ గవర్నెన్స్‌ – సులభతర సేవలు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ గురించి సమీక్షిస్తూ, ప్రజలందరూ దీన్ని సులభంగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రజలు ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, ప్రజల్లో దీనిపై అవగాహన తక్కువగా ఉన్నందున, మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లు బాధ్యత తీసుకుని వాట్సాప్‌ గవర్నెన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా దీని గురించి అవగాహన పెంచాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వ సేవలను పొందడమే కాకుండా, తమ ఫిర్యాదులు, అర్జీలు కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా పంపవచ్చని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, నిరక్షరాస్యులు కూడా తమ ఫిర్యాదులను వాయిస్‌ మెసేజ్‌ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్‌ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగం కూడా పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఆర్టీఐజీఎస్‌ ద్వారా విస్తృత సేవలు

ప్రస్తుతం వాట్సాప్‌ ద్వారా 200 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నామని, ఈ నెలాఖరు వరకు మరో 150 అదనపు సేవలను జతచేస్తామని ఐటీ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి భాస్కర్‌ కాటమనేని సీఎం చంద్రబాబుకు వివరించారు. తద్వారా మొత్తం వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలు 350కి చేరుతాయని చెప్పారు.
భవిష్యత్తులో మొత్తం 500 సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించి వన్ స్టేట్ వన్ యాప్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనిద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు కేవలం ఒకే ఒక ప్లాట్‌ఫామ్‌లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అటవీ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్, ఐజీ ఈగల్ ఆర్‌కె రవికృష్ణ, సీఈఓ వి. కరుణ, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త విధానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సులభమైన, పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్‌ అక్షరాస్యత పెంపొందించుకోవడం ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోగలుగుతారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ మార్గంలో ముందంజ వేస్తుందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870