పోసాని అరెస్టుపై జగన్ స్పందన

పోసాని అరెస్టుపై జగన్ స్పందన

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆయన పై పలు కేసులు నమోదయ్యాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఇతర నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోసానిపై తాజాగా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు నిన్న హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేసి తరలించారు. నేడు కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు పంపే అవకాశం ఉంది.

Advertisements

జగన్ స్పందన

జగన్ పోసాని కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. “దేవుడు అన్నీ చూస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. మేమంతా మీకు తోడుగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు. ఈ కేసులో పోసానికి న్యాయపరమైన సహాయం అందించేందుకు ఇప్పటికే వైసీపీ న్యాయవాదుల బృందాన్ని నియమించామని, రాబోయే రోజుల్లో పోసానిపై పెట్టిన కేసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పారు.ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలిపారు. ఆలోపు మనోధైర్యంతో ఉండాలని ఆమెకు సూచించారు.

ys jagan posani krishna murali 394 1740635432

పోసాని అరెస్టును వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. “గత ప్రభుత్వం సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఎవరు విమర్శలు చేసినా వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వారిపై ఊహించని వేధింపులు మొదలయ్యాయి” అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న ఈ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇవాళ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకువచ్చి పోసాానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది.

కేసు వివరాలు

జనసేన నేత జోగిమణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై 196, 353 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతరం అన్నమయ్య జిల్లాకు తరలించారు.

పోసాని అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఒకవైపు కూటమి ప్రభుత్వం న్యాయపరంగా అన్ని కోణాల్లో కేసులను పరిశీలిస్తుందని చెబుతుండగా, మరోవైపు వైసీపీ ఈ చర్యలను తీవ్రంగా తప్పుబడుతోంది. పోసాని వ్యవహారం ఏపీలో మళ్లీ కొత్త రాజకీయ వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది.

Related Posts
ఉచిత బస్సు పై షర్మిల విమర్శలు
ఉచిత బస్సు పై షర్మిల విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టడం, 2024 ఎన్నికల ముందు ఒక పెద్ద హామీగా నిలిచింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన Read more

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
tirumala vishadam

తిరుమలలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. తిరుమల బస్టాండ్ సమీపంలోని పద్మనాభ నిలయం భవనం రెండో అంతస్తుపై నుంచి పడి మూడేళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. Read more

B R Naidu: గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్
గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ఎస్వీ గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ Read more

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు
పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు Read more

×