हिन्दी | Epaper

స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు

Sharanya
స్టాలిన్‌ పై త‌మిళ‌సై మండిపాటు

తమిళనాడులో భాషా వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. హిందీ భాషా వ్యతిరేకత, భాషా విధానాలు, విద్యా వ్యవస్థపై నియంత్రణ తదితర అంశాలపై డీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ను బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ బహిరంగంగా నిలదీశారు. ఆమె చేసిన విమర్శలు, వాటికి డీఎంకే నుంచి వచ్చిన స్పందనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

HY02TAMILISAI

స్టాలిన్‌కు తమిళసై ఓపెన్ ఛాలెంజ్

బీజేపీ నేత తమిళసై మాట్లాడుతూ, మీ పిల్లలు, మీ మంత్రుల పిల్లలు ఎంత మంది కేవలం రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థాయిలో హిందీ భాషా వ్యతిరేకతను ప్రోత్సహిస్తూనే, స్వయంగా మంత్రులు, కుటుంబ సభ్యులు తమ పిల్లలను CBSE స్కూళ్లలో చదివించడం ఏ విధమైన నీతిని చూపుతుందని ఆమె నిలదీశారు. తమిళనాడు ప్రజలను భాషా రాజకీయాలతో మభ్యపెట్టడం తగదని, భాషా వివాదాన్ని సృష్టించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

తిరుచీ రైల్వే స్టేషన్ ఘటనపై భాజపా నిరసన

తిరుచీ రైల్వే స్టేషన్‌లో జరిగిన సైన్‌బోర్డు ఘటన కూడా ఈ వివాదాన్ని మరింత రాజేసింది. డీఎంకే కార్యకర్తలు హిందీ భాషలో ఉన్న సైన్‌బోర్డును తుడిచివేసిన ఘటనను తమిళసై తీవ్రంగా ఖండించారు. “ఇది ప్రజా ఆస్తుల విధ్వంసం భాషను అడ్డుపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం అసహనానికి దారి తీస్తుంది,” అని ఆమె విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎంతోమంది తమిళనాడుకు వస్తుంటారని, హిందీ భాషను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

భాషా విధానం పై డీఎంకే, బీజేపీ వైఖరి

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం హిందీ వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మూడు భాషల విధానం బీజేపీ మద్దతు ఇస్తున్నదని, కానీ డీఎంకే మాత్రం రెండు భాషల విధానాన్ని మాత్రమే అనుసరించాలనే పట్టుబడుతోందని తమిళసై తెలిపారు.

విద్యా వ్యవస్థపై తమిళసై ప్రశ్నలు

తమిళసై మాట్లాడుతూ, డీఎంకే మంత్రుల పిల్లలు, మనవళ్లు CBSE స్కూళ్లలో చదువుతున్నారు. వాళ్లు మూడు భాషలను నేర్చుకుంటున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు అదే అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నించారు. భాషా వివాదంతో విద్యను రాజకీయ మాదిరిగా మార్చడం తగదని సూచించారు. ప్రజల భవిష్యత్తుపై రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకే ఆడే రాజకీయం ప్రజలకు నష్టం కలిగించే అవకాశముందని ఆమె వ్యాఖ్యానించారు.

తమిళసై ఆరోపణలపై డీఎంకే స్పందన

తమిళసై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. డీఎంకే నేతలు మాట్లాడుతూ, తమిళ భాషకు ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పేమీ లేదు. హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నించేది బీజేపీయే. మేము ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నాం, అని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు హిందీ నేర్చుకునే అవకాశాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని డీఎంకే విమర్శకులు సూచిస్తున్నారు. భాషా వివాదం, విద్యా విధానంపై కొనసాగుతున్న ఈ రాజకీయ కల్లోలం తమిళనాడు రాజకీయం, బీజేపీ-డీఎంకే మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది. ప్రజలు భాషా రాజకీయాలను ఎంతవరకు అంగీకరిస్తారనేదానిపై ఆధారపడి భవిష్యత్తులో ఎన్నికలలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870