हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్

Vanipushpa
కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రజలు బీజేపీ బెదిరింపులకు భయపడరని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య, రెండు భాషల విధానం ముప్పులో ఉన్నాయన్నారు. “మనం హిందీని అంగీకరించాలని వారు దృఢంగా ఉన్నారు. వారు తమిళనాడు చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును నాశనం చేయాలనుకుంటున్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం తమిళనులను రెండో తరగతి పౌరులుగా మార్చాలని కోరుకుంటోంది” అని ఉదయనిధి పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీ అయిన ఏఐఏడీఎంకేను కూడా తమతో చేతులు కలిపి రాష్ట్ర ద్విభాషా విధానం కోసం పోరాడాలని కోరారు. రాజకీయ లాభం కోసం దీనిని ఉపయోగించకుండా తమతో చేరి గొంతును పెంచాలని ఏఐఏడీఎంకేను కోరుతున్నామన్నారు.

కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్


విద్యా నిధులను నిలిపివేశారు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంపై కేంద్ర సర్కారు విద్యా నిధులను నిలిపివేసి రాష్ట్రంపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమిళనాడు ద్విభాషా విధానం కోసం పోరాటంలో పాల్గొనాలని ఆయన పలు పార్టీలను కూడా కోరారు. సమగ్ర శిక్షా అభియాన్ నిధిలో తమిళనాడు తన వాటాను న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తోందన్నారు. తమిళనాడుకు న్యాయబద్ధంగా విడుదల చేయాల్సిన రూ.2,190 కోట్ల కోసం రాష్ట్రం యాచించడం లేదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. “మేము మీ అబ్బ సొమ్మేం అడగడం లేదు. తమిళనాడు విద్యార్థుల తల్లిదండ్రులు పన్ను రూపంలో చెల్లించిన మా హక్కును మేం అడుగుతున్నాం. మాకు చెందిన నిధిని మేము అడుగుతున్నాం.” అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అన్నారు.

డీఎంకే నిరసనలు
కొత్త విద్యా విధానం, త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి చెన్నైలో డీఎంకే నిరసన చేపట్టింది. ఈ నిరసనలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ నిరసనలో పాల్గన్నారు. తమిళనాడు ప్రజలు త్రిభాషా భాషా విధానాన్ని ఎప్పటికీ అంగీకరించరని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మాట్లాడుతూ.. తమిళనాడు త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే నిధులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయకపోతే రాష్ట్రానికి నిధులను విడుదల చేయదని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870