हिन्दी | Epaper

ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు

Vanipushpa
ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు

ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముందుగానే ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ విజయం తమ దే అని ధీమాగా ఉన్నారు. బీజేపీ హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ విజయం సాధిస్తామ ని విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ మేము సైతం అంటోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ప్రచారం యూపీ సీఎం యోగీతో కొత్త మలుపు తీసుకుంది. కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.
కేజ్రీవాల్ లక్ష్యంగా ఢిల్లీ ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఢిల్లీ ప్రచారంలోకి దిగారు. యూపీ సీఎం యోగీ ఢిల్లీలో యూపీ, బీహార్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆప్, కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన అస్త్రాలను సంధించారు. కేజ్రీవాల్ కు సవాళ్లు చేసారు. ఆప్ పాలనలో ఢిల్లీ డంపింగ్ యార్డుగా మారిందని ఆరోపించారు. విద్యుత్ నిరంతర సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందని టార్గెట్ చేసారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందని చెప్పిన యోగీ.. తాను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే కేజ్రీవాల్ యమున నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు.

యోగీ టార్గెట్ యోగీ ఆరోపణలపైన కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. యూపీలో విద్యుత్ కోతల గురించి ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా గురించి ప్రశ్నిస్తున్న యోగీ.. పదేళ్లుగా యూపీలో అధికారం లో ఉండి..ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి యోగీ స్పందిం చారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. హ్యాట్రిక్ పై ఆప్ గురి పెట్టింది. కాగా, గెలుపు తమదే అంటూ బీజేపీ కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలో ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870