sandeep dikshit

రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ ఎలా చెప్పగలదు : సందీప్‌ దీక్షిత్‌

కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతున్నదని అయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలను రిగ్గింగ్‌ చేయడం అసాధ్యమని కొద్దిసేపటి క్రితం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

Advertisements

న్యూఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ చోటుచేసుకుందని అన్నారు. ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి పడుతున్నా కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని చెప్పడం అమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు సామాన్య ప్రజలు చాలా మంది ఈవీఎంల రిగ్గింగ్‌ గురించి మాట్లాడారని చెప్పారు.

‘మీరెందుకు అనవసరంగా ఓట్లడుగుతున్నారు..? ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడుతున్నాయిగా. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓట్లు బీజేపీకే వెళ్తాయి’ అని సామాన్యులు అంటున్నట్లు సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీ తప్ప మరే పార్టీ గెలువదని సామాన్యులు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Related Posts
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సర్వం సిద్ధం..
222

హైదరాబాద్‌: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రేపు (మంగళవారం)జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల Read more

మహారాష్ట్రలో త్వరలో మత మార్పిడుల నిరోధక చట్టం
nitesh rana

మహారాష్ట్రలో మత మార్పిడులను నిరోధించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వర్గాల మధ్య చిచ్చు Read more

100 మీటర్ల లోతులో బస్సు ప్రమాదం
100 మీటర్ల లోతులో బస్సు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో 100 మీటర్ల లోతులో బస్సు ప్రమాదం: సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో బుధవారం, 100 మీటర్ల లోతులో బస్సు ప్రమాదం జరిగింది. భీమ్‌తాల్ Read more

మహారాష్ట్ర రైలు ప్రమాదం వేదనకు గురిచేసింది – పీఎం మోదీ
Jalgaon Train Tragedy

మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో జరిగిన భయానక రైలు ప్రమాదం దేశాన్ని శోకసాగరంలో ముంచెత్తింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రధాని నరేంద్ర Read more

Advertisements
×