Khawaja Muhammad Asif

Khawaja Asif : భారత్ మమ్మల్ని వదిలిపెట్టదు – పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

కశ్మీర్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత భారత్ నుంచి సైనిక దాడి జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తమవుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also : Pakistan : ఉగ్రవాదులను తరలిస్తున్న పాక్ సైన్యం

పూర్తి అప్రమత్తం పాక్ సైన్యం

ఇస్లామాబాద్‌లో రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, భారత్ నుంచి దాడి జరిగే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇందుకు తమ సైన్యాన్ని పటిష్టం చేసినట్టు తెలిపారు. “ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మేము తీసుకున్నాం,” అని ఆసిఫ్ పేర్కొన్నారు. భారత దాడికి అవకాశముందని సైన్యం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే దాడి కారణాలు లేదా సమయం గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు.

పాక్ మూడుపదుల్లో అణ్వాయుధాల వినియోగం

పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ దేశ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఏర్పడితే తప్ప అణ్వాయుధాలను వినియోగించబోమని ఖ్వాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితిలో ఉన్నాయని, ఇటువంటి పరిస్థితిలో ఏ చిన్న సంఘటన కూడా పెద్దపాటి సంక్షోభానికి దారితీయవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దాంతో భారత ఉపక్రమాలను పాక్ గట్టి ఆందోళనతో గమనిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×