దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజా ప్రకటనలో వాస్కోడగామా ఎక్స్ప్రెస్ను కాజీపేట జంక్షన్ మీదుగా నడిపిస్తున్నట్లు తెలిపారు. మే 9న వాస్కోడగామా నుంచి జషిడి జంక్షన్కు వెళ్లే (17321) ఎక్స్ప్రెస్ రైలు, మే 12న జషిడి నుంచి వాస్కోడగామాకు తిరిగివచ్చే (17322) రైలు కాజీపేట మీదుగా ప్రయాణించనున్నాయి. అలాగే రైల్వే సాంకేతిక అభివృద్ధి పనుల కారణంగా రక్సోల్-చర్లపల్లి, ముజాఫర్పూర్-చర్లపల్లి వంటి ఇతర రైళ్లను కూడా కాజీపేట మీదుగా తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణ సమయాలు సరిచూసుకోవాలని సూచించారు.
కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ జిల్లాలో ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ ఉత్తర-దక్షిణ భారత్ను కలిపే ప్రధాన కూడలి. రోజూ వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి దేశం నలుమూలలకు ప్రయాణిస్తుంటారు. 1929లో కాజీపేట-బల్లార్షా మార్గం ప్రారంభం కావడంతో చెన్నై-ఢిల్లీ నేరుగా అనుసంధానమయ్యింది. కాజీపేట జంక్షన్ ద్వారా అనేక ముఖ్యమైన రైళ్ల రాకపోకలు కొనసాగుతుండటంతో, ఇది భారత రైల్వే వ్యవస్థలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
Read Also : KTR Injured : గాయపడ్డ కేటీఆర్..కొద్దీ రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే
చరిత్రలో కాజీపేట పాత్ర
కాజీపేట రైల్వే లైన్ చరిత్ర 1874లో సికింద్రాబాద్ లైన్ నిర్మాణంతో మొదలైంది, ఇది నిజాం ఆర్థిక సహాయంతో పూర్తయింది. ఆ తరువాత నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలో భాగమైంది. 1989లో ఈ ప్రధాన రైల్వే మార్గాన్ని విజయవాడ వరకు విస్తరించారు. 1909 నాటికి వాడి నుంచి వరంగల్ వరకు నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే విస్తరించి, మద్రాస్ రైల్వే తూర్పు తీర విభాగానికి అనుసంధానమైంది. కాజీపేట స్టేషన్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ రూమ్స్, రిటైరింగ్ రూమ్, భోజన స్థలాలు, పుస్తక విక్రయ కేంద్రాలు వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.