యూరప్లోని స్పెయిన్, పోర్చుగల్ దేశాలను భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత కారణంగా నగరాలు అంధకారంలో మునిగిపోయాయి. మాడ్రిడ్, లిస్బన్ వంటి ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడం, మెట్రో రైళ్లు స్తంభించడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా రవాణా వ్యవస్థలు గందరగోళానికి గురయ్యాయి. విద్యుత్ గ్రిడ్లో తలెత్తిన సమస్యకు కారణాలను కనుగొనడానికి అధికారులు విచారణ ప్రారంభించారు.
నగరాల్లో జనజీవనంపై తీవ్ర ప్రభావం
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో ట్రాఫిక్ గందరగోళం పెరిగిపోయి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు సొరంగాల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులను బయటకు తీసుకురావడంలో అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోర్చుగల్లో కూడా లిస్బన్, పోర్టో నగరాల్లో ట్రాఫిక్ లైట్లు నిలిచిపోయి రైళ్లు, మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు కార్యాలయాలు, నివాస సముదాయాల నుంచి బయటకు వచ్చి అవస్థలు ఎదుర్కొన్నారు.
Read Also : Bilawal Bhutto Zardari : భిలావల్ భుట్టో వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్
పునరుద్ధరణ చర్యలు
స్పెయిన్, పోర్చుగల్ ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు రెడ్ ఎలక్ట్రికా, రెన్ సంస్థలు సమన్వయంతో చర్యలు చేపట్టాయి. లిస్బన్, మాడ్రిడ్ విమానాశ్రయాల్లో బ్యాకప్ జనరేటర్ల సాయంతో కార్యకలాపాలు కొనసాగించాయి. ఫ్రాన్స్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్పంగా విద్యుత్ అంతరాయం సంభవించినప్పటికీ, అక్కడ వెంటనే సరఫరా పునరుద్ధరించబడింది. మొత్తంగా ఈ విద్యుత్ కోత యూరప్ ప్రజల దైనందిన జీవితాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.