Paka Venkata Satyanarayana

Paka Venkata Satyanarayana : రాజ్యసభ కూటమి అభ్యర్థి ఈయనే !

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. నామినేషన్ గడువు ముగియబోతున్న వేళ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, చివరికి బీజేపీ అధిష్ఠానం అనుభవజ్ఞుడైన పాకా వెంకట సత్యనారాయణకే అవకాశమిచ్చింది.

Advertisements

Read Also : AP Government: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ

బీజేపీలో ఉన్న సీనియర్ నేతకు అవకాశం

పాకా సత్యనారాయణ బీజేపీలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సీనియర్ నేత. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక పదవులు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ టికెట్‌కి పాకా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఈసారి మాత్రం ఆయనకు రాజ్యసభ టికెట్ లభించింది. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి యూరప్ పర్యటనలో ఉన్నప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో ఆయన పేరు ఖరారైంది.

అనూహ్యంగా లభించిన అవకాశంపై పార్టీ శ్రేణుల్లో ఆనందం

ఇటీవల అనేక పేర్లు ప్రచారంలో ఉన్నా, చివరకు పార్టీకి చిరకాలంగా సేవలందించిన స్థానిక నేతకే అవకాశం ఇవ్వడం బీజేపీ ఆలోచనను ప్రతిబింబిస్తుంది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, పాకా వెంకట సత్యనారాయణ ఎంపికతో ఆశ్చర్యం కలిగించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పైకి వచ్చి పార్టీ నమ్మకాన్ని గెలుచుకున్న ఆయనకు ఈ అవకాశం లభించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకం నెలకొంది. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related Posts
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్‌కు కేంద్ర అనుమతి తీసుకున్న నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పరిజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్రాన్ని Read more

గాయంతో హీరోయిన్ రష్మిక..ఫొటోస్ వైరల్
rashmika gayam

జిమ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక తన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గాయపడిన నేపథ్యంలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Read more

Nadendla Manohar : ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన
Nadeendla Manohar ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఎంత Read more

Omar Abdullah:కాశ్మీర్ ప్రజలకి శుభవార్త చెప్పిన ఒమర్ అబ్దుల్లా
Jammu kashmir:కాశ్మీర్ ప్రజలకి శుభవార్త చెప్పిన ఒమర్ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మహిళలకు శుభవార్త చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ రంగ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×