हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

నమక్కల్ వాయు పుత్రుడికి లక్ష వడలతో వడమాల.

Divya Vani M
నమక్కల్ వాయు పుత్రుడికి లక్ష వడలతో వడమాల.

భారతదేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో హనుమాన్ జయంతి ఒకటి.ఈ వేడుకను ప్రాంతానుసారంగా భిన్నమైన తేదీల్లో జరుపుకుంటారు.ఇటీవల తమిళనాడులోని ప్రసిద్ధ నమక్కల్ ఆంజనేయ స్వామి ఆలయం హనుమాన్ జయంతి ఉత్సవాలతో కళకళలాడింది.వాయుపుత్రుడి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విభిన్న పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.భక్తుల కోసం స్వామివారికి పెద్ద మొత్తంలో వడమాలలు సమర్పించారు.సోమవారం తెల్లవారు జామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందారు. నమక్కల్ ఆంజనేయ స్వామి విగ్రహం 18 అడుగుల పొడవుతో దేశంలోనే ప్రసిద్ధమైన హనుమాన్ విగ్రహాల్లో ఒకటి.ఈ విగ్రహం పూర్తిగా ఏకశిలతో తయారైందిగా,5వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతారు.

hanuman
hanuman

ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో పాండ్య పాలకులు నిర్మించారు. గర్భగృహానికి పైకప్పు లేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత.స్వామివారు తన నడుముకు ఖడ్గాన్ని కట్టుకుని, చేతిలో సాలిగ్రామంతో చేసిన మాలను ధరించి భక్తులకు దర్శనమిస్తారు.ఈ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి ఏడాది మార్గశిర నెలలో తొలి నక్షత్రం రోజున నిర్వహిస్తారు.ఈ సందర్భంగా స్వామివారికి 1,00,008 వడమాలలతో తయారుచేసిన భారీ మాల సమర్పిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం కర్పూర హారతులు ఇచ్చి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం అభిషేకాల్లో కొబ్బరి నూనె, పాలు, పెరుగు, చందనం, శనగ పిండి, పంచామృతం వంటి పదార్థాలతో స్వామివారిని అభిషేకించారు. సాయంత్రం 4 గంటలకు ముత్తంగి అలంకరణ విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక అలంకరణతో స్వామివారి విగ్రహం మరింత దేవత్వాన్ని సంతరించుకుంది. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయం చుట్టూ పూలతో అలంకరించిన ప్రాంగణం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ప్రత్యేక పూజలు, హారతులతో ఆంజనేయుని ఆరాధించిన భక్తులు శాంతి, సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870