గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు

గేమ్ ఛేంజర్ పై నకిలీ బాక్సాఫీస్ కలెక్షన్ల విమర్శలు

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్ “చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను చేసినట్టుగా ప్రకటించి విమర్శల పాలవుతోంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార పోస్టర్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా 186 కోట్ల రూపాయలను అధిగమించాయని విడుదల చేసారు , ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చర్చ నడుస్తుంది .

100crFakeForGameChanger మరియు #GameChangerPosterScam వంటి హ్యాష్ట్యాగ్లతో సోషల్ మీడియాలో ఈ వ్యత్యాసం గురించి ట్రెండ్ అవుతుంది . సినిమా మార్కెటింగ్ బృందం విడుదల చేసిన గణాంకాల ప్రామాణికతను చాలా మంది నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు .

జనవరి 10,2025న విడుదలైన గేమ్ ఛేంజర్ లో కియారా అద్వానీ, అంజలి ప్రధాన పాత్రల్లో నటించగా, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, జయరామ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

వివాదం బయటపడటంతో, అభిమానులు మరియు పరిశ్రమ నిపుణులు బాక్సాఫీస్ రిపోర్టింగ్లో మరింత పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం లో ప్రభ్తం సినిమాకు ఇచ్చిన వెసులుబాటును కూడా , కోర్టు సూచనల వాళ్ళ వెనక్కు తీసుకోవడం తో సినిమా పైన ఆర్ధిక పరం గా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *