हिन्दी | Epaper
వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

కనకదుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Sudheer
కనకదుర్గమ్మ ను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ సన్నిధికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన రామ్‌నాథ్ కోవింద్..అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

రామ్‌నాథ్ కోవింద్కు ఆలయ ఈవో కె.ఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా, ఈవో రామారావు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో తో పాటుగా ఆలయ డిప్యూటీ ఈవో ఎమ్.రత్నరాజు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఇక రామ్‌నాథ్ కోవింద్ భారతదేశ మాజీ రాష్ట్రపతి (2017-2022)గా సేవలందించారు. ఆయన 1954 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ జిల్లాలో జన్మించారు. ఒక న్యాయవాది, రాజకీయ నాయకుడిగా తన జీవితం ప్రారంభించి, భారతీయ జనతా పార్టీ (BJP) ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాష్ట్రపతిగా నియమితులయ్యే ముందు బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా, అలాగే రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో అనేక విధానాల కోసం ప్రాథమ్యమిచ్చారు. ప్రధానంగా సామాజిక న్యాయం, విద్య, పేదల అభ్యున్నతి, మరియు మహిళా సాధికారతపై దృష్టి పెట్టారు. ఆయనే భారతదేశ రెండో దళిత రాష్ట్రపతిగా నిలిచారు, ఈ పదవిలో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.ఆయన మృదువైన స్వభావం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే విధానం ద్వారా ప్రజల మన్నన పొందారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870