rambabu

పుష్పకి ఓ నీతి గేమ్‌ఛేంజర్‌కి మరో నీతినా?: అంబటి

రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్‌ ప్రీరిలీజ్‌ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్‌(22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంతో మరణించారు. దీంతో చిత్ర బృందం తరఫున చెరో 5 లక్షల పరిహారం ప్రకటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. గేమ్‌ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మరణించిన ఘటనపై పవన్‌ కల్యాణ్‌ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా ప్రశ్నించారు.


అంతకుముందు గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపైనా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలనే మనస్తత్వం మాది కాదంటూ గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

‘ సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పనేంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదు. మేము స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ని ఎంతమంది విమర్శించినా కలసి నటించేప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలుకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కృష్ణ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అది.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున చెరో 5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

Related Posts
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కోడి పందేలు
crock fight

తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోడి పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో Read more

ఈ సంవత్సరం భర్తీ చేస్తాం: నారా లోకేష్
ఈ సంవత్సరం భర్తీ చేస్తాం: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యా రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కట్టుబడినట్టు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం, నూతన మౌలికవసతులు, ఖాళీల Read more

వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: సాక్షుల మరణాలు, అనుమానాలు మరియు సమగ్ర దర్యాఫ్తు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది. Read more

శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం
జనార్థన్ రెడ్డి సమాధానం

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం శాసనమండలిలో కడప - రేణిగుంట నూతన జాతీయ రహదారుల పనుల విషయమై గౌరవ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, దువ్వారపు Read more