हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

Uday Kumar
తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం

హైదరాబాద్‌, డిసెంబరు 17 : వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈ ఏడాది గణేష్‌ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించారు. తొక్కిసలాట జరగకుండా ఏఐ టెక్నాలజీతో అనుసంధానమైన డ్రోన్లను వినియోగించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన ఈ విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది.

ప్రజారక్షణలో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రభుత్వాలు, సంస్థలకు.. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఐఎ్‌సజీ, సీఎన్‌బీసీ-టీవీ18 సంస్థలతో కలిసి అవార్డులు అందించగా.. డిజిటల్‌ ఇంజినీరింగ్‌ అవార్డులలో చాలెంజర్‌ క్యాటగిరీలో అత్యుత్తమ స్థిరత్వ కార్యక్రమ(టాప్‌ సస్టెయినబిలిటీ ఇనిషియేటివ్‌) పురస్కారం తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించారు. ఈ క్యాటగిరీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 230 నామినేషన్ల నుంచి తెలంగాణ పోలీసులకు పురస్కారం దక్కింది. స్మార్ట్‌ సిటీ టెక్నాలజీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రామాణికాలను నిర్దేశించిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డు దక్కడంపై అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగానికి ఈ పురస్కారం దక్కడం మరింత ప్రోత్సాహాన్ని అందించిందని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870