हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి

Sudheer
ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించనున్న కారణంగా అక్కడి విద్యార్థులు, అధికారుల్లో ఆనందం నెలకొంది.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, సిబ్బంది కలిసి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి సభలో పాల్గొనే విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. ప్రధానంగా భద్రతా పరంగా ఎటువంటి లోపం లేకుండా చూడాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారులోని రాష్ట్రపతిభవన్లో బస చేయనున్నారు. అక్కడి నుండి మంగళగిరి ఎయిమ్స్‌ పర్యటనకు బయలుదేరి, స్నాతకోత్సవంలో పాల్గొని తిరిగి రాష్ట్రపతిభవనానికి చేరుకోనున్నారు.

రాష్ట్రపతి పర్యటన రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించనుంది. ఇది మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవానికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రి సేవలు అందిస్తున్న ఎయిమ్స్‌ విద్యార్థులకు రాష్ట్రపతి సందేశం ఓ ప్రేరణగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870