KTR direct question to Cong

అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం BRS పార్టీ నాయకులను కాదు, డాక్టర్ అంబేడ్కర్ ను నిర్బంధించడంతో పాటు, ఆయనకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదు” అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంబేడ్కర్ అభయ హస్తం పథకాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమమీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహానీయున్ని నిర్భంధించి, అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వందల మంది పోలీసులను పెట్టి తమను నిర్బంధిస్తున్నారని విమర్శించారు. గురుకులాల్లో 48 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. గురుకుల విద్యార్థులను తాము ఎవరెస్ట్‌ శిఖరాలు ఎక్కిస్తే.. మీరు పాడె ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదేనా మీరు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళి అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ గురుకుల బాటను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతాడని, అయితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టని విమర్శించారు. రాహుల్‌ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటన్నారు. మీ సీఎంకు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్‌ గాంధీకి సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతామని అన్నారు.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!
mlc elections telangana and

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియనున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తరువాత, విపక్షాల నుండి పోటీ లేకపోవడంతో అభ్యర్థుల గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. దీనివల్ల Read more

భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ
LOKESH DAVOS

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మన్ కళ్యాణితో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రక్షణ పరికరాల తయారీకి Read more

ముంబైలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సచిన్ టెండూల్కర్
sachin vote

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బిజినెస్ దిగ్గజాలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ.. ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. భారత Read more

శ్రీవారి అన్నప్రసాద మెనూలో మార్పులు..
Changes in Srivari Annaprasadam menu

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *