ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాజీ నగర్కు చెందిన యువతి యాస్మిన్ భాను అనుమానాస్పదంగా మృతి చెందింది. మొదట ఇది ఆత్మహత్యగా భావించగా, పోలీసులకు ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యాస్మిన్ భాను వేరే మతానికి, వేరే సామాజిక వర్గానికి చెందిన సాయితేజ్ అనే యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి ఈ ఏడాది ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే ఆమె మృతి చెందడం చిత్తూరు వాసుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ఇది ఖచ్చితంగా ప్రూవ్ హత్యానే
పెళ్లి తర్వాత భర్తతో వేరిగా జీవిస్తున్న యాస్మిన్.. తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఫోన్ రావడంతో ఆదివారం పుట్టింటికి వెళ్లింది. అదే రోజు ఆమె మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే యాస్మిన్ భాను భర్త సాయితేజ్ వాదన మేరకు ఇది హత్య గా భావిస్తున్నారు. తన భార్యను నవ్వుతూ పంపించానని, మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని మార్చురీలో చూపించారని ఆయన వాపోయారు. అంతేకాకుండా, పెళ్లి తర్వాత తమకు ప్రాణహాని ఉందని అప్పటికే వారు పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కూడా కోరిన విషయం వెలుగులోకి వచ్చింది.
తండ్రి , మేనల్లుడు పరారీ
ఈ ఘటనలో ప్రధాన అనుమానితులైన యాస్మిన్ తండ్రి షౌకత్ అలీ, అతడి మేనల్లుడు లాలూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యాస్మిన్ మృతి ఒక పరువు హత్యే అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. సాయితేజ్ మాత్రం తన భార్యకు న్యాయం జరగాలని, బాధితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.