ఆపరేషన్ సిందూర్ (operation sindoor ) విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi Speech) చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా శభాష్లు అందుకుంటోంది. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా స్పందించారు. ఆయన మోదీ ప్రసంగాన్ని “పవర్ఫుల్ మెసేజ్”గా అభివర్ణిస్తూ, భారతదేశ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ప్రధాని ఇచ్చిన స్పష్టమైన సందేశం అభినందనీయమన్నారు.
పవన్ ట్వీట్
టెర్రర్ & టాక్ (ఉగ్రవాదం & చర్చలు), టెర్రర్ ట్రేడ్ (ఉగ్రదండగలు & వ్యాపారం), బ్లడ్ & వాటర్ (రక్తం & నీరు) కలసి వెళ్లలేవని మోదీ చెప్పిన మాటలు ఎంతో గంభీరంగా, ధైర్యవంతంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఉగ్రవాదంపై దేశం తీసుకుంటున్న కఠినమైన వైఖరిని ప్రపంచానికి స్పష్టంగా చూపించిందని ప్రశంసించారు.
“భారత్ మాతా కీ జై!”
తమ సందేశం ముగింపులో “భారత్ మాతా కీ జై!” అంటూ నినదించిన పవన్, దేశభక్తిని పునరుద్ఘాటించారు. ప్రధాని ప్రసంగం దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై భారత్ తీసుకున్న గట్టి నిర్ణయాలను తాను సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Read Also : Tim’s Hospital : అతి త్వరలో సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం