భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ మీద now పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తాజా ప్రకటన ప్రకారం, పాకిస్థాన్ మహిళల జట్టు ఈ టోర్నీ కోసం భారత్కు రాదు. బదులుగా తటస్థ వేదికపై తమ మ్యాచ్లు ఆడతామని స్పష్టం చేశారు.ఈ నిర్ణయం ‘హైబ్రిడ్ మోడల్’ ఒప్పందం ప్రకారం తీసుకున్నదని నఖ్వీ తెలిపారు. గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత్ అప్పట్లో పాకిస్థాన్ వెళ్లకుండా, తటస్థ వేదిక అయిన దుబాయ్లో తన మ్యాచ్లు ఆడింది. అప్పట్లోనే ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి – ఒకరు టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినా, రెండో దేశం తటస్థ వేదికను ఎంచుకునే హక్కు కలిగి ఉంటుంది.”ఆ ఒప్పందానికి మేము కట్టుబడి ఉన్నాం,” అని నఖ్వీ తెలిపారు. “పాకిస్థాన్ ఇప్పుడు అదే దారిని అనుసరిస్తోంది. భారత్ తరపున ఐసీసీ తటస్థ వేదికను ఖరారు చేస్తుంది. ఆ వేదిక ఎక్కడైనా సరే, మేము అక్కడే మ్యాచ్లు ఆడతాం,” అని స్పష్టంగా చెప్పారు.ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు భారతదేశంలో మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది.

ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది భారత్ సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇప్పటికే నేరుగా అర్హత పొందిన జట్లుగా నిలిచాయి.ఇదే సందర్భంగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఇటీవల లాహోర్లో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నమెంట్ గురించి ప్రశంసలు కురిపించారు. ఆ టోర్నీలో పాకిస్థాన్ మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, థాయ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై గెలిచి ప్రపంచకప్కు అర్హత సాధించింది. మొత్తం ఐదు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం పట్ల నఖ్వీ గర్వం వ్యక్తం చేశారు.ఈ తాజా ప్రకటన రాజకీయ ఉద్రిక్తతల మధ్య క్రికెట్ కొనసాగుతున్న తీరుకు ఒక ఉదాహరణ. భారత్ – పాకిస్థాన్ క్రికెట్కు మధ్య ఉన్న శీతల సంబంధాలు, టోర్నీల్లో వీరు తటస్థ వేదికలకే పరిమితం కావడాన్ని నిరూపిస్తున్నాయి. క్రికెట్ అభిమానుల ఆకాంక్షలు వేరే ఉన్నా, పరిస్థితులు ఇంకా మారలేదన్నది స్పష్టమవుతోంది.
Read Also : IPL :14 ఏళ్ల సూర్యవంశికి జట్టులో స్థానం కల్పించిన రాజస్థాన్