బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే ఆయన నివాసంలో కత్తితో దాడి చేసిన కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలు నదియా జిల్లా చాప్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఉపయోగించిన సిమ్కార్డు ఆమె పేరుతోనే నమోదైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించడంతో అరెస్టు చేశారు.
అదేవిధంగా, నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడని, ఆయనకు ఆ మహిళతో ముందే సంబంధాలు ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు భారత్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ముంబై పోలీసులు తమ దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ముంబై పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దాడి వెనుక ఉన్న పూర్తి పరిణామాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.