हिन्दी | Epaper
నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం?

భారత స్పిన్నర్ గా చరిత్రలో నిలుస్తాడా..వరుణ్

Divya Vani M
భారత స్పిన్నర్ గా చరిత్రలో నిలుస్తాడా..వరుణ్

వరుణ్ చక్రవర్తి ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 14 వికెట్లతో, ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. మొదటి టీ20లో 3 వికెట్లు తీసి మెరిసిన వరుణ్, మూడో టీ20లో 5 వికెట్లతో సంచలనం సృష్టించాడు. అతని మిస్టరీ బౌలింగ్ టీమిండియాకు కొత్త అస్త్రంగా మారింది.ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో బాట్స్‌మెన్లను కుదిపేసి చరిత్ర సృష్టించాడు.

భారత స్పిన్నర్ గా చరిత్రలో నిలుస్తాడా..వరుణ్
భారత స్పిన్నర్ గా చరిత్రలో నిలుస్తాడా..వరుణ్

మొదటి మ్యాచ్‌లో 3/23 తో మెరిసిన వరుణ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందాడు.రెండవ టీ20లో 2/38, మూడవ టీ20లో 5/24 తో మరోసారి అద్భుత ప్రదర్శన చూపాడు. నాలుగవ టీ20లో 2/28, ఐదో టీ20లో 2/25తో మెరుపులు మెరిపించాడు.ఈ విధంగా, వరుణ్ 14 వికెట్లతో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత స్పిన్నర్‌గా చరిత్రలో నిలిచాడు.ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధి పేరిట ఉంది. అతను 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 13 వికెట్లు సాధించి రికార్డు సృష్టించాడు. అయితే, వరుణ్ ఈ రికార్డును అధిగమించి 14 వికెట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.సిరీస్‌లలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు ఇప్పటివరకు వెస్టిండీస్ పేసర్ జేసన్ హోల్డర్ వద్ద ఉంది.

అతడు 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 15 వికెట్లు తీసి రికార్డు సాధించాడు.వరుణ్ చక్రవర్తి గతంలో కూడా అద్భుత ప్రదర్శనలు ఇచ్చాడు. 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో 12 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందాడు. ఆ సిరీస్‌లో 5 వికెట్ల స్పెల్ కూడా నమోదు చేశాడు.ఇంగ్లాండ్‌తో ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీసి, వరుణ్ టీమిండియాకు మరొక శక్తివంతమైన అస్త్రంగా మారాడు. అతని మిస్టరీ బౌలింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం స్పష్టమే. భవిష్యత్తులో వరుణ్ భారత బౌలింగ్‌కు కొత్త ఊతాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870