ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి సీతారామన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవసారి పూర్తి బడ్జెట్ను ఆర్థిక మంత్రిగా ఎనిమిదో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ 2025పై రైతుల, మహిళలు, యువతకి ఉపాధి వరకు అంచనాలు భారీగా పెరిగాయి. బడ్జెట్లో భారీ ప్రకటనలు వివిధ నివేదికల ప్రకారం, ఆదాయపు పన్ను మినహాయింపు నుండి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచడం వరకు బడ్జెట్లో అంచనాలు ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయవచ్చని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆదాయపు పన్నులో మినహాయింపు పొందే అవకాశం ఉండొచ్చు.
అంతే కాకుండా రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్ను ప్రవేశపెట్టే యోచన ఉంది. PM కిసాన్ యోజన కింద, అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. BofA నివేదిక ప్రకారం, PM కిసాన్ యోజన మొత్తం కూడా బడ్జెట్లో పెరగవచ్చు. రైతులకు అందజేసే సాయాన్ని ఏటా రూ.12,00లకు పెంచవచ్చని వార్తలు వస్తున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ , రాబోయే బడ్జెట్ 2025-26లో రైతులకు ఒక బహుమతి అందజేయవచ్చు. ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)పై లోన్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

బీమా రంగ అంచనాలు రాబోయే బడ్జెట్లో బీమా ఇంకా ఆరోగ్య సంరక్షణ రంగాలకు రాయితీలతో సహా ఎన్నో పన్ను ప్రయోజనాలను అందించాలని బీమా కంపెనీలు భావిస్తున్నాయి. SBI జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ 2047 నాటికి ‘అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ‘బీమా సుగం’ వంటి కార్యక్రమాలకు నియంత్రణ అలాగే ఆర్థిక మద్దతు అవసరమని అన్నారు.