हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

బిర్యానీ తెచ్చిన తంట 8 లక్షలు ఖర్చు ఎక్కడంటే?

Sharanya
బిర్యానీ తెచ్చిన తంట 8 లక్షలు ఖర్చు ఎక్కడంటే?

ఆహారం తినడం ఒక ఆనందకరమైన భాగం. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న అపశృతి కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముంబైకి చెందిన ఓ మహిళకు రెస్టారెంట్‌లో బిర్యానీ తినడం ఒక భయానక అనుభవంగా మారింది. తాను తిన్న బిర్యానీలోని ఎముక గొంతులో ఇరుక్కుపోయి నెల రోజుల పాటు తీవ్ర బాధలను ఎదుర్కొంది. ఈ ఘటన ఆమె కుటుంబానికి తీవ్ర ఆర్థిక భారంగా మారింది. అయితే వివరాలలోకి వస్తే ముంబైకి చెందిన రూబీ షేక్ ఫిబ్రవరి 3న తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లింది. కుటుంబ సమేతంగా భోజనం చేయాలని ఆమె అనుకున్నారు. అందరూ కలిసి ఆహారాన్ని ఆస్వాదిస్తుండగా, రూబీ షేక్ బిర్యానీ తినడం ప్రారంభించింది. అయితే, ఆమె తిన్న బిర్యానీలో ఓ చిన్న ఎముక ఉండటంతో అది ఆకస్మికంగా గొంతులో ఇరుక్కుపోయింది.

Woman,Getting,Ultrasound,Of,A,Thyroid,From,Doctor

డాక్టర్ల సూచనలు.. రూబీ నిర్లక్ష్యం

ఆమె మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొద్దిసేపటికే తీవ్ర అసౌకర్యం మొదలైంది. ఆసుపత్రిలో వైద్యులు ఆమెను పరీక్షించి, సీటీ స్కాన్ చేయాలని సూచించారు. అయితే, రూబీ తనకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదని భావించి సిటీ స్కాన్ చేయకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, కొన్ని గంటల తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఆమెకు తీవ్రమైన గొంతు నొప్పి, మింగలేని సమస్య మొదలైంది కానీ ఆ ఎముక గొంతులో ఇరుక్కుపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. రూబీ మొదట దాన్ని చిన్న సమస్యగా పట్టించుకోలేదు. అయితే, రెండు రోజుల తరువాత ఆమెకు తీవ్రమైన జ్వరం, హైబీపీ రావడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి వైద్యులు మరింత విభిన్నంగా పరీక్షలు నిర్వహించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్ ద్వారా పరీక్షించగా, ఆమె గొంతులో ఒక చిన్న ఎముక ఉండి ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. ఎముకను సాధారణంగా తీయడం సాధ్యం కాకపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దాదాపు 8 గంటల పాటు నడిచిన ఈ సుదీర్ఘ ఆపరేషన్‌లో ఎముకను తొలగించారు. అయితే, ఈ ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారింది. ఆహారం తిన్నప్పుడు అది సర్వసాధారణంగా కిందికి జారిపోవాలి. కానీ ఈ ఘటనలో ఎముక పైకి ప్రయాణించడంతో వైద్యులకు ఇది సవాల్‌గా మారింది.

ఆపరేషన్‌కు భారీ ఖర్చు.. కుటుంబానికి ఆర్థిక భారం

రూబీ భర్త ప్రకారం, ఈ ఆపరేషన్‌ మొత్తం ఖర్చు రూ. 8 లక్షలు అయింది. సాధారణ కుటుంబానికి ఇది తీరని భారంగా మారింది. వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు విరాళాలు ఇచ్చారు. దాదాపు నెల రోజుల పాటు రూబీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినా, ఆమె సాధారణ జీవనానికి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది. ఆమె గొంతులో బలమైన ఇన్‌ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉండటంతో వైద్యులు ప్రత్యేకమైన పైప్ అమర్చారు. 21 రోజుల పాటు ఆమె ఆ పైప్ ద్వారానే ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నెల రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న రూబీ తాను ఇక బిర్యానీ తినబోనని, ఇంట్లో కూడా వండబోనని తేల్చి చెప్పింది. చిన్న అవగాహన లేకుండా తిన్న ఆహారం ఎలా ప్రాణాంతకంగా మారుతుందో తన అనుభవం అందరికీ గుణపాఠంగా మారాలని తెలిపింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870