ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే

ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఎప్పుడంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్‌డౌన్ మొదలైంది ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి “మినీ వరల్డ్ కప్”గా పిలిచే ఈ టోర్నీ ఇప్పుడు వివాదాలతో చర్చల్లో మారింది. ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ దుబాయ్‌లలో జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. అన్ని జట్లు తమ జట్లను ప్రకటించాయి షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన 5 ప్రధాన వివాదాలు మీడియాలో విపరీతంగా చర్చించబడుతున్నాయి అవి ఏమిటో చూద్దాం.

  1. పాకిస్తాన్ పర్యటనకు టీమిండియా నిరాకరణ: చాలా కాలం తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది కానీ భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించింది ఆ తర్వాత ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించింది. టీమిండియా ఇప్పుడు దుబాయ్‌లోని మ్యాచ్‌లను ఆడుతుంది సెమీఫైనల్స్ ఫైనల్స్ కూడా అక్కడే జరగతాయి.
  2. పాకిస్తాన్ భారతదేశానికి రావడానికి నిరాకరించింది: భారత జట్టు పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించగా పాకిస్తాన్ కూడా భారతదేశానికి వెళ్లేందుకు నిరాకరించింది పాకిస్తాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌ను కోరింది ఈ వ్యవహారం ఇద్దరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించింది.
  3. ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై వివాదం: 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని తిరిగి స్వీకరించారు ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రీడలు నిషేధించబడ్డాయి. ఇంగ్లాండ్‌లోని రాజకీయ నాయకులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని అభ్యర్థించారు అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ డిమాండ్‌ను తిరస్కరించింది.
  4. టీం ఇండియా జెర్సీపై గందరగోళం: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జట్ల జెర్సీలపై టోర్నమెంట్ నిర్వహించే దేశం పేరు ఉండటంలో సాధారణంగా అవకాసం ఉంటుంది అయితే భారత జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది తర్వాత “పాకిస్తాన్ పేరు జెర్సీపై ఉంటుంది” అని బీసీసీఐ స్పష్టం చేసింది.
  5. భారత మ్యాచ్ రిఫరీ అంపైర్ల వివాదాలు: ఛాంపియన్స్ ట్రోఫీకి అంపైర్లు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. కానీ వాటిలో ఒక్క భారతీయుడి పేరు కూడా లేదు భారత జట్టు, నితిన్ మీనన్‌ను ఐసీసీ జాబితాలో చేర్చాలని కోరింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నితిన్ పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించాడు. అలాగే మాజీ ఆటగాడు జవగళ్ శ్రీనాథ్ సెలవు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వివాదాలు అన్ని టోర్నమెంట్‌కు మరింత ఉత్కంఠను ఆసక్తిని తెచ్చాయి. అయితే ఇవన్నీ కూడా మరింత ప్రశ్నలకు దారితీస్తున్నాయి.
Related Posts
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు
duvvada srinivas

వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు అవ్వడం , పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజాగా వైసిపి ఎమ్మెల్సీ Read more

డ్రోన్ షోను నిర్వహించిన గోద్రెజ్ ప్రాపర్టీస్
Godrej Properties organized the drone show

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, హైదరాబాద్‌ నగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని మరియు వారసత్వాన్ని వేడుక జరుపుకునేందుకు Read more

నాసా ఉపగ్రహ చిత్రాలు: ఇండో-గంగా ప్రాంతంలో తీవ్రమైన కాలుష్య పరిస్థితి
indiafog tmo 20240115 lrg

నాసా ఉపగ్రహ చిత్రాలు ఒక ఆందోళనకరమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఉన్న ఇండో-గంగా ప్రాంతం ఇప్పుడు తీవ్రమైన కాలుష్యంతో కప్పబడి ఉంది. ఈ Read more

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *