తెలంగాణలో శీతలగాలుల (winter) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో ప్రజలు తీవ్రమైన చలిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, కోహీర్లో 7 డిగ్రీలకుపైగా, సిర్పూర్-యూలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Read also: AP Weather: పలు జిల్లాల్లో రేపు వర్షాలు: APSDMA

This situation will continue for the next two days
ఆదివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు
ఇక నవంబర్ 22 నుంచే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది. దీని ప్రభావంతో ఆదివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిన్నారులు, వృద్ధులు చలికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జలుబు, దగ్గు, జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :