हिन्दी | Epaper
బెంగళూరులో భారీ వర్షాల హెచ్చరిక ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD తమిళనాడుకు రెడ్ అలర్ట్ మిచాంగ్ తుఫాను:తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు ఎన్‌సీఆర్ వాయు కాలుష్యం & బాణసంచా నియంత్రణ బెంగళూరులో భారీ వర్షాల హెచ్చరిక ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD తమిళనాడుకు రెడ్ అలర్ట్ మిచాంగ్ తుఫాను:తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు ఎన్‌సీఆర్ వాయు కాలుష్యం & బాణసంచా నియంత్రణ బెంగళూరులో భారీ వర్షాల హెచ్చరిక ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD తమిళనాడుకు రెడ్ అలర్ట్ మిచాంగ్ తుఫాను:తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు ఎన్‌సీఆర్ వాయు కాలుష్యం & బాణసంచా నియంత్రణ బెంగళూరులో భారీ వర్షాల హెచ్చరిక ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువే: IMD తమిళనాడుకు రెడ్ అలర్ట్ మిచాంగ్ తుఫాను:తమిళనాడు-ఏపీ తీరాలకు ముప్పు పలు జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు ఎన్‌సీఆర్ వాయు కాలుష్యం & బాణసంచా నియంత్రణ

Telugu news: Rain alert: పలు జిల్లాల్లో వర్ష సూచన

Tejaswini Y
Telugu news: Rain alert: పలు జిల్లాల్లో వర్ష సూచన

Rain alert: దిత్వా తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంటలకు నష్టం కలగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ అయ్యాయి.

డిసెంబర్ 3న ఉదయం 8:30 గంటలకు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తాజా నిర్ణయం

కర్ణాటక దక్షిణ ప్రాంతాలు

ఈ అల్పపీడన ప్రాంతం నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ మరికొన్ని గంటల్లో సాధారణ అల్పపీడనంగా పూర్తిగా బలహీనపడుతుందని అంచనా. ఈ వ్యవస్థ కారణంగా ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి నుంచి కర్ణాటక దక్షిణ ప్రాంతాలు, ఉత్తర కేరళ మీదుగా లక్షద్వీప్ వరకు ద్రోణి ఏర్పడింది.

దక్షిణ కోస్తాలో తేలికపాటి మోస్తరు వర్షాలు

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉండొచ్చని అంచనా. తెలంగాణలో కూడా నాగర్‌కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెయిన్ అలర్ట్ జారీ చేశారు.

తదుపరి రెండు రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు తగ్గి పొడి వాతావరణం నెలకొనవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది; గరిష్టంగా 50 కి.మీ వేగం వరకు పెరగవచ్చని హెచ్చరిక.

అకాల వర్షాలు, ఈదురు గాలుల ప్రభావంతో వరి, పత్తి వంటి కోత దశలో ఉన్న పంటలకు నష్టం కలగవచ్చని వాతావరణ నిపుణులు సూచించారు. తడిసిన ధాన్యాన్ని రక్షిత ప్రదేశాలకు తరలించాలని, నిల్వ చేసిన పంటలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరిగే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870