We won't expel anyone from Gaza, we'll just move them somewhere else.. Trump

గాజా నుంచి ఎవరినీ బహిష్కరించం..వేరే చోటికి తరలిస్తాం: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గాజా పౌరులను వేరే చోటికి తరలించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ట్రంప్‌ మాట్లాడుతూ..కీలక వ్యాఖ్యలు చేశారు. శిథిలమైన గాజాను పునర్‌నిర్మించే ప్రణాళికలో భాగంగా అక్కడినుంచి ఎవరినీ బహిష్కరించమని స్పష్టంచేశారు. బుధవారం ఐర్లాండ్‌ ప్రధాని మైఖేల్‌ మార్టిన్‌తో భేటీకి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గాజా నుంచి ఎవరినీ బహిష్కరించం

గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం

ఈసందర్భంగా యూఎస్‌ సెనెట్‌ మైనారిటీ నాయకుడు చక్‌ షూమర్‌ అంశాన్ని ట్రంప్‌ మరోసారి ప్రస్తావించారు. షూమర్ గతంలో యూదుడైనా.. ఇప్పుడు పాలస్తీనియన్‌ అని వ్యాఖ్యానించారు. నాకు సంబంధించినంత వరకు షూమర్‌ పాలస్తీనియన్‌. ఆయన గతంలో యూదుడిగా ఉండేవారు. ఇప్పుడు కాదు. ఆయన పాలస్తీనియనే అని పేర్కొన్నారు. ఇక, గత నెలలోనూ ట్రంప్ ఒక పోస్టులో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇక, గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మార్టిన్‌ తెలిపారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు.

గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోత

గాజాలో ఇజ్రాయెల్‌ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా వేసిన కేసులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్‌ క్యాబినెట్‌ నిర్ణయం అనంతరం ఇది చోటుచేసుకుంది. గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఐర్లాండ్‌కు మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో గతేడాది డిసెంబరులో ఐర్లాండ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్‌అవీవ్‌ ప్రకటించింది. ఇక, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. పాలస్తీనీయులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే.. గాజాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో భేటీ సందర్భంగా చెప్పారు.

Related Posts
జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!
జేపీ నడ్డాకు రాహుల్ గాంధీ లేఖ!

పౌరులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందించడానికి ప్రాథమిక స్థాయి నుండి తృతీయ స్థాయిల వరకు ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ Read more

సీబీఐ కోర్టులో విజయసాయి పిటిషన్
Vijayasai Reddy quits polit

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన కోసం సీబీఐ కోర్టును అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, Read more

రైతులకు శుభవార్త తెలిపిన RBI
RBI gives good news to farm

రైతులకు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త అందించింది. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ రుణాల పరిమితిని 1.6 లక్షల Read more

చంద్రబాబు కు రాహుల్ గాంధీ ఫోన్..
rahul cbn

ఏపీ సీఎం చంద్రబాబు కు కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్ చేసారు. చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి మృతితో తీవ్ర విషాదంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *