हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా

sumalatha chinthakayala
శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో ‘శీష్‌ మహల్‌’ పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చనున్నట్లు ప్రకటించారు.”ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అలాగే, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆమె మీడియాతో వెల్లడించారు.

image

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, బీజేపీ ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ (అద్దాల మేడ)గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్ దాన్ని ఏకంగా 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ”నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడను నిర్మించుకున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని నిర్ణయం

ఆప్ మోసాలను అద్దాల మేడగా చూపిస్తూ, బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారంలో ఓ ప్రధాన అంశంగా తీసుకుంది. ఈ అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం కలిగించాయి, చివరకు బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రజల్లో అనవసర విమర్శలు రాకుండా ఉండేందుకు, బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఢిల్లీకి కొత్తగా వచ్చనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ బంగ్లాలో నివసించే అవకాశం లేదన్న ఊహాగానాల నడుమ, ఆమె తాజా ప్రకటనతో ఈ అంశానికి క్లారిటీ వచ్చింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870