हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం – సీఎం రేవంత్

Sudheer
గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ప్రాధాన్యంగా పెట్టుకుంటున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్‌లో, 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి మరింత పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీతో ఒప్పందాలు చేయడం, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరపడం జరుగుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఒప్పందాలు ఉద్యోగావకాశాలు పెంచేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో నేరుగా చర్చలు జరుపుతామన్నారు. ఈ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు గొప్ప వేదికగా మారుతుందని చెప్పారు. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రం రూ. 40,232 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించిందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది ఈ విజయాన్ని అధిగమించి మరింత పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ ఈ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తాయని చెప్పారు. పెట్టుబడులు మాత్రమే కాకుండా, ఉద్యోగావకాశాలు, శ్రేయస్సు పట్ల దృష్టి సారించనున్నామన్నారు. ప్రభుత్వ కృషి ద్వారా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870