తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కులగణనను (Kulaganana) కేవలం ఒకే ఏడాదిలోనే పూర్తి చేశామని గర్వంగా ప్రకటించారు. ఇది సామాజిక న్యాయానికి మూలాధారం అవుతుందని, అన్ని వర్గాల వాస్తవ స్థితిగతులపై స్పష్టమైన సమాచారం సమకూరుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
కల్వకుంట్ల గడీ బద్దలైంది – రేవంత్ ధీటుగా
తెలంగాణ రాజకీయాల్లో దాదాపు దశాబ్దకాలం దర్డంగా ఉన్న కల్వకుంట్ల కుటుంబ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం అన్నారు. “తమకు తిరుగు లేదని విర్రవీగిన కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టాం. ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి నిర్మించాం” అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారి పాలనపై సందేహాలు వ్యక్తం చేసినవాళ్లకు తగిన బుద్ధి చెప్పామన్నారు. “మూడు నెలల ముచ్చటే అని నవ్వినవాళ్ల ముందు, తలెత్తుకుని నిలిచేలా ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తున్నాం” అని ధీమాగా తెలిపారు.
తెలంగాణకు రోల్ మోడల్ హోదా – పథకాల అమలుతో
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, మహిళా సాధికారతపై దృష్టి పెట్టిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని, అందుకే తెలంగాణను “ఇందిరమ్మ రాజ్యం”గా పునరుద్ధరించగలిగామని రేవంత్ గర్వంగా తెలిపారు.
Read Also : Hyderabad : 60వేల ఉద్యోగాలిచ్చాం.. కాదని నిరూపిస్తే క్షమాపణ చెబుతా – సీఎం రేవంత్