Warm welcome to Prime Minister.. Pawan Kalyan

ప్రధానికి హృదయపూర్వక స్వాగతం: పవన్ కళ్యాణ్

అమరావతి: నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగలో ప్రధాని మోడీ హాజరై ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

image
image

ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ చొరవతో ఏపీ అభివృద్ధివైపు పరుగులు పెడుతోందన్నారు. ‘ప్రధానికి హృదయపూర్వక స్వాగతం. ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈరోజు విశాఖ కేంద్రంగా “దక్షిణ కోస్తా రైల్వే జోన్” కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేస్తానని’ వెల్లడించారు.

కాగా, ప్రధాని మోడీ నేడు ఏపీలో అడుగుపెట్టనున్నారు. విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు మోడీ. దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ కు సైతం శ్రీకారం చుట్టనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోడీ పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. మూడు రోజుల కిందట ఆయన విశాఖలో అడుగుపెట్టారు. ఏర్పాట్లను సమీక్షించారు. మోదీ రోడ్ షో తో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారు.

Related Posts
తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి వేదికను Read more

బాకులో COP29: ఫైనాన్స్ మరియు పర్యావరణ చర్చల్లో తీవ్ర సంక్షోభం
COP29

బాకులో జరుగుతున్న COP29 సమావేశం, గురువారం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ సమావేశంలో పత్రికలో ఉన్న ఒక నిర్దిష్ట ప్యారాగ్రాఫ్ పై పలు దేశాలు అభ్యంతరాలను Read more

Pushpa 2 Dialogue: పరీక్షా సెంటర్ గోడపై పుష్ప-2 డైలాగ్
Pushpa 2 Dialogue: పరీక్షా సెంటర్ గోడపై పుష్ప-2 డైలాగ్

పరీక్ష కేంద్రంలో వివాదాస్పద రాతలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ఓ విద్యార్థి చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పరీక్ష కేంద్రం గోడపై Read more

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయ్యే అధికారుల జాబితాలో లా అండ్ Read more