Warm welcome to Prime Minister.. Pawan Kalyan

ప్రధానికి హృదయపూర్వక స్వాగతం: పవన్ కళ్యాణ్

అమరావతి: నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగలో ప్రధాని మోడీ హాజరై ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

Advertisements
image
image

ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ చొరవతో ఏపీ అభివృద్ధివైపు పరుగులు పెడుతోందన్నారు. ‘ప్రధానికి హృదయపూర్వక స్వాగతం. ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈరోజు విశాఖ కేంద్రంగా “దక్షిణ కోస్తా రైల్వే జోన్” కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేస్తానని’ వెల్లడించారు.

కాగా, ప్రధాని మోడీ నేడు ఏపీలో అడుగుపెట్టనున్నారు. విశాఖలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు మోడీ. దాదాపు రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విభజన హామీల్లో ఒకటైన విశాఖ రైల్వే జోన్ కు సైతం శ్రీకారం చుట్టనున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను సైతం జాతికి అంకితం చేయనున్నారు. మోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కాగా ఏర్పాట్లు చేసింది. మోడీ పర్యటనకు సంబంధించి ఇన్చార్జిగా మంత్రి నారా లోకేష్ వ్యవహరించారు. మూడు రోజుల కిందట ఆయన విశాఖలో అడుగుపెట్టారు. ఏర్పాట్లను సమీక్షించారు. మోదీ రోడ్ షో తో పాటు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పాల్గొంటారు. పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారు.

Related Posts
మూసీపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? భ‌ట్టి కి జ‌గ‌దీశ్ రెడ్డి స‌వాల్
jagadeesh saval

మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌ణాళిక ఏంటో చెప్పాల‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీని ఏం Read more

ఎన్నో ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చాయి కానీ.. శ్రీలీల
sreeleela pushp2

హీరోయిన్ శ్రీలీల తన కెరీర్‌లో చాలా ఐటెమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని తిరస్కరించానని చెప్పుకొచ్చింది. "పుష్ప-2" సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించినట్లు ఆమె రాబిన్ Read more

ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి
ఏసీబీ వలలో కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి

రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, రమేష్ అనే వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్, రిజిస్ట్రేషన్ Read more

మళ్లీ అధికారంలోకి వచ్చాక పెరిగిన వాటర్‌ బిల్లు మాఫీ చేస్తా: కేజ్రీవాల్
Kejriwal will waive the increased water bill after coming back to power

న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పెరిగిన నీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంతి Read more

×